tag:blogger.com,1999:blog-6017999693079769658.post4676688059764325846..comments2024-03-27T20:00:07.843+05:30Comments on స్మరణ: మోక్షపధం - రామ దర్శనంభారతిhttp://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-6017999693079769658.post-85868361941210997792020-05-11T20:39:11.467+05:302020-05-11T20:39:11.467+05:30ఆ కోదండముపట్టు ఠీవి , కనులందార్తావన జ్యోతులున్
రాక...ఆ కోదండముపట్టు ఠీవి , కనులందార్తావన జ్యోతులున్<br />రాకాశోభలుగుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్<br />లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలో<br />కైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కంగల్గు సర్వార్థముల్ .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-49778434225345876552020-05-10T12:09:51.099+05:302020-05-10T12:09:51.099+05:30నన్ను శరీరంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసే జననం, ఒక అ...నన్ను శరీరంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసే జననం, ఒక అబద్ధం. <br />నన్ను శరీరంలోంచి బయటికి తీసే మరణం, ఒక నిజం . <br />అబద్ధం నుండి నిజం వైపు సాగేదే ................జీవితం!<br /><br />ఈ శరీరం మనం కాదు, అన్న భావన ప్రతి ఒక్కరికి కలగాలి . <br /><br />మాట్లాడేది శరీరం కాదు ,మనమే.నోరు మూసి ,కళ్ళు మూసి మనం మెదడు ప్రదేశంలో మాట్లాడతాం(శరీరంలోని మరే ప్రేదేశంలో మాటలు ,ఆలోచనలు ఉండవు). మాట్లాడేది మనమే కానీ, మెదడు కాదు . మెదడున్న ప్రదేశంలో మాట్లాడతాం. చూసేవి కళ్ళు కాదు, కళ్ల ద్వారా మనం చూస్తాం. చెవులు వినవు, చెవుల ద్వారా మనం వింటాం . నాలుకకు రుచి తెలియదు, రుచి తెలిసేది నాలుక ద్వారా మనకు. అలా చర్మం ద్వారా స్పర్శ మనకు తెలుస్తుంది .olfactory glands ద్వారా వాసనను మనం తెలుసుకుంటాం.<br />శరీరమే అన్నీ తెలుసుకునేదయితే శవం ఎందుకు చూడదు? ఎందుకు వినదు , ఎందుకు స్పర్శకు స్పందించదు? శవం ఎందుకు ఆలోచించదు, ఎందుకు మట్లాడదు? ఎందుకంటే చూసేవాడు, వినేవాడు, స్పందించేవాడు శరీరాన్ని వదిలేసాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి... మనం శరీరంలో ఉండేవాళ్ళమే కదా. అంటే శరీరం వేరు, మనం వేరు. అతను పైలోకాలకు వెళ్ళిపోయాడు అంటాం,( మన కళ్లముందరే శరీరం అక్కడే ఉంటుంది. శరీరమే అతడైతే పోయాడని ఎందుకనాలి, అక్కడే ఉన్నాడు. శరీరాన్ని వదిలి వెళ్లిపోయాడని అర్థం. అంటే శరీరం వేరు, నేను వేరు. మేను ఎప్పటికీ నేను కాదు. నేను సెపరేట్ మేను సెపరేట్. ఈ" నేను" ను మనం ఆత్మ అనీ సోల్ అనీ ,సెల్ఫ్ అనీ అంటాం. <br />శరీరంను రథం అనుకుంటే ఐదు ఇంద్రియాలు చేసే ఐదు రకాల పనులను కలిపితే పది. ఈ పది గుర్రాలతో శరీరాన్ని మనం నడిపిస్తాం. మనం దశరథుడు అని అర్థం. ప్రతీ మనిషికి మూడు గుణాలు ఉంటాయి అవి సత్వ గుణం ,రజో గుణం,తమోగుణం. సత్వగుణం అంటే కౌసల్య ,రజో గుణం అంటే సుమిత్ర , తమోగుణం అంటే కైకేయి. ఈ దశరథునికి ముగ్గురు భార్యలు అంటే ఆ మూడు గుణాలు మనకు భార్యలు అని అర్థం. దశరథుడు అయోధ్య నగరానికి రాజు, అయోధ్య అంటే యోదింప వీలు కానిది. అంటే, జయించడానికి వీలుకానిది అని అర్థం. <br /><br />మెదడున్న ప్రదేశాన్ని సహస్రారం అంటారు. సహస్రారం అనగా మెదడులో nuerons వెయ్యి ప్రదేశాలలో ముడిపడి ఉంటాయి. ధ్యానంలో గనక ఒక సాధకుడు ఈ వెయ్యి ముడులను శక్తితో విప్పగలిగితే, ఆ వెయ్యి ముడుల దగ్గర వెయ్యి పద్మ దళాలు కనిపిస్తాయి . అందుకే దీనిని సహస్రారం అంటారు. <br />ధ్యానంలో ఒక్క ముడిని విప్పితే సాధకునికి 16 రకాల శక్తులు లభిస్తాయి. అలా 1000 ముడులను విప్పితే 1000× 16=16000 అవుతుంది .అంటే ఆ సాధకునికి 16000 రకాల శక్తులు వస్తాయి. శ్రీకృష్ణుడు ఈ వెయ్యి ముడులు ధ్యానంలో విప్పాడు. అందుకే ఆయనకు 16000 మంది భార్యలు అన్నారు. <br />గుండె ప్రాంతంలో ఉండే ముడులను అనాహతం అంటారు . ఇవి 8 ఉంటాయి .ఈ ఎనిమిది ముడులను సాధకుడు ప్రయత్నపూర్వకంగా విప్పితే అక్కడ 8 పద్మ దళాలు కనిపిస్తాయి మరియు ఆ సాధకునికి అలా చేసినప్పుడు విపరీత ఆనంద ప్రాప్తి కలుగుతుంది . ఈ 8 ముడులను 8 భార్యలుగా చెప్పారు. శ్రీకృష్ణుడు ఇవీ విప్పాడు కాబట్టి, ఆయనకు 8 గురు భార్యాలన్నారు. శాస్త్రంలో ఎలా చెప్పారో, కథ కూడా అలాగే నడిచింది.<br />ఇక మళ్లీ రామాయనానికి వద్దాం, సీత మిథిలా నగరంలో పుట్టింది. మిథ్య అంటే మాయ ,ఊహ, లేనిది, ఉట్టిదే అనీ అర్థం. లేనిదాన్ని ఊహించుకోవడం. సీత అనే బ్రహ్మ జ్ఞానం, రాముడు అనే పరమాత్మతో ఉన్నంత వరకు హాయిగా ఉన్నది. లేని బంగారు లేడి అనే కోరిక కలగడం వల్ల, జ్ఞానం పరమాత్మతో దూరమయ్యి రావణుడనే కోరికల కొలిమిలో పడి క్షోభించింది . పరమాత్మునితో లింక్ కోల్పోయిన ఆత్మను తిరిగి లింక్ ఏర్పరచడానికి పరమాత్ముడు జ్ఞానమనే వారధిని నిర్మించి రావణుని(దుర్గుణాలు) సంహరించి బ్రహ్మజ్ఞానమనే సీతను తిరిగి తెచ్చాడు. దీన్నే మన వాళ్ళు కట్టే ,కొట్టే ,తెచ్చే అన్నారు. అంటే దీనిని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు .1.మనసును కట్టివేసి అహమును కొట్టేసి బ్రహ్మ జ్ఞానమనే సీతను తెచ్చే అని. 2.వారధి కట్టి రావణున్ని కొట్టి సీతను తెచ్చే అని. <br />ఆత్మ పరమాత్మల సంయోగ, వియోగమే మన జీవితం. మనం మన స్వ స్థితిని అనగా ఆత్మ స్థితిని కోల్పోయి, శరీర స్థితిలో బతుకుతున్నాం. అందుకే వందల సమస్యలు. మనం అంతా ఆత్మలం. ఆత్మస్థితిలో, జ్ఞానస్థితిలో, ధ్యానస్థితిలో ఉండాల్సినోల్లం. శరీరం వేరు మనం వేరు. ఒకటొది మాంస శరీరం. రెండోది సూక్ష్మ శరీరం. మూడోది ప్రాణ శరీరం. నాల్గోది మనో శరీరం. ఐదోది జ్ఞాన శరీరం. ఆరోది విజ్ఞాన శరీరం. ఏడోది ఆత్మశరీరం. ఆరు శరీరాలు రాలితే మిగిలేది ఆత్మ. నిరంతరం ఆత్మ స్థితిలో ఉండాలంటే సాక్షి ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాలి. శుభమస్తు.Rajunoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-86119911176230788452017-04-05T22:02:07.095+05:302017-04-05T22:02:07.095+05:30రామకథని మనకి భలే అన్వయం చేశారు. మనసంస్కృతిలో భగవాన...రామకథని మనకి భలే అన్వయం చేశారు. మనసంస్కృతిలో భగవానుని చేరే మార్గం చక్కగా విడమర్చి చూపెట్టారు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-89345178542095216072017-04-05T18:34:51.109+05:302017-04-05T18:34:51.109+05:30శ్రీరామ, సకల గుణాభిరామ వందనం👏
స్వయాన వాల్మీకి మహర...శ్రీరామ, సకల గుణాభిరామ వందనం👏<br />స్వయాన వాల్మీకి మహర్షి రాముని గుణాలను వర్ణించతరం కాక "సకల గుణాభి రాముడు " అని చెప్పడం జరిగింది. ఇక మనమేం చెప్పగలం. కాని మనకు తోచిన రీతిలో స్మరించుకుందాం.<br /><br />ఉత్తమ విద్యార్థి :<br /><br />తన గురువైన విశ్వామిత్రుని అనుసరిస్తూ, ఆజ్ఞను పాటిస్తూ యజ్ఞ సంరక్షణ చేసినవాడు.<br /><br />పితృవాక్య పరిపాలకుడు :<br /><br />తనకు జన్మప్రసాదించిన తల్లిదండ్రులను సేవిస్తూ వారి కోరికలనే ఆజ్ఞలను పాటించేవాడు. కైకేయి మాతకు తన తండ్రి మాట ఇచ్చినాడని తెలిసిన మరుక్షణం అడవులకు వెళ్ళడానికి సంసిద్ధుడైనవాడు. తనను అడవులకు పంపడం న్యాయ సమ్మతం కాకున్నా తండ్రి మాటనే భగవదాజ్ఞగా పాటించినవాడు.<br /><br />ఇంకో విషయం రాముడికి సీత అంటే ఎందుకు ప్రేమంటే ఆమె తన తండ్రికి నచ్చింది కాబట్టి.<br /><br />భాతృ ప్రేమికుడు :<br /><br />తన నల్గురు తమ్ములు తనకు ఎందులోను సాటిరాకున్నప్పటికీ వారికి తమ తమ రాజ్యాలను అప్పగించినవాడు. యుద్ధంలో మూర్ఛ పొందిన లక్ష్మణుని చూసి " లక్ష్మణా ! నీవు లేని నాకు సీత ఎందుకు ? రాజ్యమెందుకు ? నేను కూడా నీతో ప్రాయోపవేశం చేస్తానని విలపించినవాడు.<br /><br />ఉత్తమ మితృడు :<br /><br />శ్రీరాముని స్నేహ భాగ్యం పొంది, ఆలింగన అదృష్టం పొందిన వారి వివరాలు చూస్తే శ్రీరామునికి ఎటువంటి జాతి భేదాలు లేవని తెలుస్తుంది. వారు సుగ్రీవుడు ( వానరం - కోతి ), గుహుడు ( నిషాదుడు - గిరిజనుడు ), విభీషణుడు ( దానవుడు - రాక్షసుడు ).<br /><br />శతృవులను సైతం గౌరవించేవాడు :<br /><br />తన భార్యను అపహరించిన రావణాసురుని సైతం గౌరవించి, వాడి మరణ సమయంలో ధర్మ శాస్త్రాలను నేర్చుకొని రమ్మని లక్ష్మణుని పంపినవాడు.<br /><br />ఉత్తమ భర్త :<br /><br />తనను అనుసరించి వచ్చిన జానకిని పోగొట్టుకొని చెట్లు పుట్టల వెంబడి తిరుగుతూ, విలపిస్తూ ఇద్దరే ఉన్నటువంటి సైన్యాన్ని సుగ్రీవుడితో స్నేహం చేసి కోట్లాది సైన్యంగా మార్చి రావణాసురుని హతమార్చి తన భార్యను దక్కించుకున్నవాడు. సీత పవిత్రతను లోకానికి ఎరుక పరచ నిశ్చయించి అగ్నిప్రవేశం చేయించినాడు.<br />అందుకే ప్రతీ అమ్మాయి తనకు శ్రీరామునిలాంటి భర్త కావాలని కోరుకుంటుంది.<br /><br />రామో విగ్రహవాన్ ధర్మః :<br /><br />శ్రీరాముడు ధర్మపాలకుడు. ధర్మానికి మాత్రమే కట్టుబడినవాడు. వాలి బలవంతుడు, అతనితో స్నేహం చేస్తే జానకిని సులభంగా పొందవచ్చునని తెలిసినప్పటికి అతడు అధర్ముడు కనుక బలహీనుడైనప్పటికి సుగ్రీవునితో స్నేహం చేసినవాడు.<br /><br />శ్రీరాముడు రాజధానిలో తిరుగుతూ మొదట తనే ప్రతీ ఒక్కరికి నమస్కరించి వారి యోగ క్షేమాలను కనుక్కునేవాడట. ఒకవేళ ఎవరైనా తనకంటే ముందుగానే నమస్కరిస్తే తప్పు చేసినట్లు బాధపడేవాడట.<br /><br />భక్త పరంధాముడు :<br /><br />తన భక్తురాలైన శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను తిన్నవాడు, తన దాసుడైన హనుమ గుండెల్లో కొలువైనవాడు, తనకు గుడి కట్టించి జైలుపాలైన రామదాసును విడిపించ తానీష కు దర్శనమిచ్చి పైకం చెల్లించినవాడు శ్రీరామచంద్ర ప్రభువు.<br /><br />ఆరివీర భయంకరుడు :<br /><br />దండకారణ్యంలో తాటకి, మారీచ, సుబాహుల మొదలు 14,000 రాక్షసులను నిర్మూలించినవాడు, రావణ, కుంబకర్ణులను జయించి భూభారాన్ని తగ్గించినవాడు, పరశురాముని అహంకారాన్ని తొలగించిన కోదండరాముడు.<br /><br />పురుషోత్తముడు :<br /><br />దేవతలు నువ్వు శ్రీహరివి అని చెప్పినప్పటికి నేను దశరథ మహారాజు పుత్రుడను, మానవుడని చెప్పి తుదవరకూ మానవ నైజాన్ని ప్రదర్శించిన పురుషోత్తముడు.<br /><br />ప్రజారంజక పాలకుడు :<br /><br />నేను మానవావతారం ఎత్తి రావణ, కంభకర్ణుల సంహరించి, ఈ భూమండలాన్ని 10 వేల సంవత్సరాలను పాలిస్తాను అని దేవతలకు చెప్పడం జరిగింది.దానికి అనుగుణంగానే పూర్తి ప్రజారంజకంగా పాలించాడు. ప్రజలు అనుమానాలు వ్యక్తం చేశారని తన ప్రాణానికి ప్రాణమైన జానకిని అడవికి పంపించాడు.<br /><br />మనము పరమశివుని ఎప్పుడు కూడా ధ్యాన నిమగ్నుడవటం చూస్తూనే ఉంటాం. మనకు వచ్చిందో లేదో కాని ఆ జగజ్జనని పార్వతి మాతకు సందేహం వచ్చిందట, స్వామి ఎవరిని ధ్యానిస్తున్నారని, అదే ప్రశ్న శివుని అడిగిందట. అప్పుడు ఆ పరమ శివుడు, " ఓ హిమవత్ పుత్రీ ! నేను ధ్యానిస్తుంది ఎవరినో కాదు, ఆ నారాయణ అవతారము, పురుషోత్తముడు, లోకోత్తర పురుషుడు అయిన శ్రీరామ నామాన్ని " అని పలికెను. చూశారా ! ఆ ఆదిదేవుడే సదా రామ నామ ధ్యానంలో మునుగుతారంటే రామనామ మహిమ ఎంత ప్రశస్థమైనదో కదా ?<br /><br />ఇంకా శ్రీరామచంద్ర ప్రభువు గురించి ఎంత చెప్పినా తక్కువే.<br /><br />శ్రీరామ జయ రామ జయ జయ రామ<br /><br />శ్రీరామ నవమి శుభాకాంక్షలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-14231807210959484342017-04-05T11:41:18.060+05:302017-04-05T11:41:18.060+05:30This is d best interpretation I have read about *R...This is d best interpretation I have read about *Rama* and *Ramayana*<br /><br />The Interpretation of *Ramayana*<br />As a *Philosophy of Life*..<br /><br />‘ *Ra* ’ means *light*, ‘ *Ma* ’ means *within me*, *in my heart*. <br />So, <br />*Rama* means the *Light Within Me*..<br /><br />*Rama* was born to *Dasharath & Kousalya*.<br /><br />*Dasharath* means ‘ *Ten Chariots* ’..<br />The ten chariots symbolize the *five sense organs*( *Gnanendriya* ) & *five organs of action*( *Karmendriya* ) ..<br /><br />*Kousalya* means ‘ *Skill* ’..<br /><br />*The skillful rider of the ten chariots can give birth to Ram*..<br /><br />When the ten chariots are used skillfully,<br />*Radiance* is born within..<br /><br />*Rama* was born in *Ayodhya*.<br />*Ayodhya* means ‘ *a place where no war can happen* ’..<br /><br />When There Is No Conflict In Our Mind, Then The Radiance Can Dawn..<br /><br />The *Ramayana* is not just a story which happened long ago..<br />It has a *philosophical*, *spiritual significance* and a *deep truth* in it..<br /><br />It is said that the *Ramayana is happening in our Own Body*.<br /><br />Our *Soul* is *Rama*, <br />Our *Mind* is *Sita*, <br />Our *Breath* or *Life-Force* ( *Prana*) is *Hanuman*, <br />Our *Awareness* is *Laxmana* and <br />Our *Ego* is *Ravana*..<br /><br />When the *Mind* (Sita),is stolen by the *Ego* (Ravana), then the *Soul* (Rama) gets *Restless*..<br /><br />Now the *SOUL* (Rama) cannot reach the *Mind* (Sita) on its own.. <br />It has to take the help of the *Breath – the Prana* (Hanuman) by Being In *Awareness*(Laxmana)<br /><br />With the help of the *Prana* (Hanuman), & *Awareness*(Laxmana),<br />The *Mind* (Sita) got reunited with The *Soul* (Rama) and The *Ego* (Ravana) *died/ vanished*..<br /><br />*In reality Ramayana is an eternal phenomenon happening all the time*..Sandhyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-6017999693079769658.post-68691803921977789332017-03-02T18:06:09.174+05:302017-03-02T18:06:09.174+05:30Sreeraama jayaraama jayajayaraamaSreeraama jayaraama jayajayaraamaAnonymousnoreply@blogger.com